- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అశ్వారావుపేట - భద్రాచలం మధ్య రాకపోకలు బంద్
by Sridhar Babu |

X
దిశ, అశ్వారావుపేట : భారీ వర్షాల నేపథ్యంలో అశ్వారావుపేట - భద్రాచలం మధ్య రాకపోకలను శనివారం అధికారులు నిలిపివేశారు. అశ్వారావుపేట మండలం వినాయకపురం వద్ద వాహనాల రాకపోకలు నియంత్రించేందుకు రెవెన్యూ సిబ్బంది రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ ట్రక్కుని నిలిపి.. హెచ్చరిక బోర్డుతో చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. అధిక వర్షాలతో వాగులు వంకలు పొంగి కుక్కునూరు వైపుగా భద్రాచలం
వెళ్లే రోడ్లపై వరదనీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో.. అటువైపుగా వాహనాల రాకపోకలు నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. అయితే నిత్యం రాజమండ్రి భద్రాచలం మధ్య పదుల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు వందలాదిమంది ప్రైవేటు రవాణా ద్వారా భద్రాచలం వెళుతుంటారు. కుక్కునూరు మీదుగా రాకపోకలు బంద్ కావడంతో.. ప్రత్యామ్నాయ మార్గం దమ్మపేట, పాల్వంచ ల మీదుగా చుట్టూ తిరిగి భద్రాచలం వెళ్లాల్సి వస్తుంది.
Next Story