పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్..!! తేల్చిసిన టీపీసీసీ అధికార‌ ప్రతినిధి మ‌ద్ది శ్రీ‌నివాస‌రెడ్డి

by Satheesh |
పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్..!! తేల్చిసిన టీపీసీసీ అధికార‌ ప్రతినిధి మ‌ద్ది శ్రీ‌నివాస‌రెడ్డి
X

దిశ‌, ఖ‌మ్మం రూర‌ల్: వ‌చ్చే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో పాలేరు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేది తనే అని.. అధిష్టానం సైతం తనకే అనుకూలంగా ఉందని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది డా. మద్ది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధ‌వారం రూర‌ల్ మండ‌లం సాయిగ‌ణేష్‌న‌గ‌ర‌లోని ఆయ‌న క్యాంపు కార్యాల‌యంలో విలేక‌రుల సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తాను ఎన్ఎస్‌యూఐ నుంచే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని, యువజన కాంగ్రెస్ నుంచి లీగల్ సెల్‌లో కూడా యాక్టివ్‌గా పనిచేశానని తెలిపారు. న్యాయవాదిగా గత 18 సంవత్సారాల నుంచి పేదలకు, పార్టీకి ఉచిత న్యాయ సేవ చేస్తున్నట్లు వెల్లడించారు.

2018 సాధారణ ఎన్నికలలో, 2021 ఎమ్మెల్సీ ఎన్నికలలో ఢిల్లీ అధిష్టానం తన పేరును పరిశీలించిందని, కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పాలేరు నుంచి టికెట్ ఆశిస్తున్నానని ఆయ‌న స్పష్టం చేశారు. పాలేరులో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. పార్టీ సీటు ఇచ్చిన ఇవ్వక‌పోయినా పార్టీ గెలుపు కోసం శ్రమిస్తాన‌ని కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో టీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలకు ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని దీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి నాయకత్వంలో, అదే విధంగా కేంద్రంలో రాహుల్, సోనియాగాంధీల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మామిడి వెంకన్న, జిల్లా మైనారిటీ సెల్ కార్యదర్శి షేక్ హుస్సేన్, ఖమ్మం రూరల్ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు షాబాదు సంధ్య రెడ్డి, మాజీ ఎంపీటీసీ రామ కృష్ణ గౌడ్, మాజీ సర్పంచ్ తేజవత్ శివాజీ, తిరుమలాయపాలెం సీనియర్ నాయకులు నాగండ్ల శ్రీనివాస రావు, రూరల్ మండల ఎస్సీ సెల్ నాయకులు వెళ్తూరి వెంకటేష్, తాళ్లపల్లి అశోక్ కుమార్ గౌడ్, మంగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed