జోరు వర్షంలో కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకుంటున్న టీపీసీసీ సభ్యుడు రాయల..

by Sumithra |
జోరు వర్షంలో కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకుంటున్న టీపీసీసీ సభ్యుడు రాయల..
X

దిశ, నేలకొండపల్లి : మండల పరిధిలోని పలుగ్రామాల్లో పార్టీ కార్యకర్తలను కలిసేందుకు టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు పర్యటించారు. సోమవారం చెరువుమాధారం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన ఆకుల నాగేంద్రరావు భౌతిక దేహానికి నివాళులర్పించారు. అనంతరం ముజ్జుగూడెం గ్రామాంలో అనారోగ్యంతో బాధపడుతున్న షేక్.సులేమాన్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుగ్గిళ్ళ స్వామిని పరామర్శించారు. జోరున వర్షం కురుస్తున్నప్పటికీ దానిని లెక్కచేయకుండా తడుస్తూనే చిరునవ్వుతో కార్యకర్తలను పలకరిస్తూ ముందుకు సాగారు.

కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, సైనికుడులాగా పనిచేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పాటును అందించాలని రాయల కోరారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు, ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని, ఈవూరి శ్రీనివాస రెడ్డి, ఆకుల శేఖర్, ఉన్నం వెంకటేశ్వరరావు, షేక్ యాకుబ్, యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.



Next Story