బంగారం మెరుగుపెడతామని టోకరా

by Sridhar Babu |   ( Updated:2023-07-16 10:45:50.0  )
బంగారం మెరుగుపెడతామని టోకరా
X

దిశ,కల్లూరు : బంగారానికి మెరుగు పెడతామని ఓ మహిళను మోసం చేసిన ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏసీపీ రామానుజం తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 10 వ తేదీన స్థానిక శాంతి నగర్ కాలనీకి చెందిన ఖమ్మం పాటి రమాదేవి వద్దకు బీకో కుమార్, చోటు కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తాము బంగారానికి మెరుగు పెడతామని చెప్పారు. వారి మాటలు నమ్మిన రమాదేవి ఆమె మెడలోని పుస్తెలతాడును తీసి ఇచ్చింది. దానిని వారు లిక్విడ్ ఉన్న ఓ గిన్నెలో వేసి వేడి చేశారు. తరువాత దానిని బయటకు తీసి పసుపు పూసి కాగితంలో చుట్టి ఆమెకు ఇచ్చారు. గంట వరకు దానిని బయటకు తీయరాదని చెప్పారు.

అది నమ్మిన రమాదేవి గంట తరువాత తీసి చూడగా సన్నగా మారింది. అసలు బరువు 40 గ్రాములు ఉండాల్సిది 14 గ్రాములకు తగ్గిపోయింది. అనంతరం మోసపోయినట్టు గ్రహించి వెంటనే కల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్సై పూదరి రఘు తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మండల పరిధిలోని లింగాల గ్రామ సమీపంలో నిందితులు సంచరిస్తుండగా అనుమానంతో పట్టుకున్నారు. వీరిని విచారించగా నేరం ఒప్పుకున్నారు. నిందితులది బీహార్ రాష్ట్రంగా తేలింది. లిక్విడ్ లో బంగారం కరిగించి తిరిగి బీహార్ కు వెళ్లి ఆ ద్రావణాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. బీకో కుమార్ పై గతంలో కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లుగా, ఇతర కేసులు కూడా ఉన్నట్లు విచారంలో వెల్లడైంది. చోటు కుమార్ పై అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రెండు కేసులు ఉన్నాయి. ఈ కార్యక్రమం లో సీఐ హానూక్, ఎస్సై పూదరి రఘు , ఏఎస్ఐ పుల్లారావు, కానిస్టేబుళ్లు సుందరం, నరసింహారావు, అశోక్ పాల్గొన్నారు.



Next Story