- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చరిత్ర తిరగరాయాలంటే బీఆర్ఎస్కు ఓటెయ్యాలి: బానోత్ హరిప్రియ నాయక్

దిశ, టేకులపల్లి : ఇల్లందు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అధికార పార్టీ గెలిచిన దాఖలాలు లేవు కానీ ఇల్లందులో చరిత్ర తిరగరాయాలంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. బుధవారం టేకులపల్లి మండలం బోడు ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం మండల అధ్యక్షుడు బొమ్మర్ల వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిధులుగా ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ ఖాయమని మూడోసారి సీఎం కేసీఆర్ కావడం ఖాయమని ,దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం ముందంజలో ఉందని ఇదంతా సీఎం కేసీఆర్ వలనే సాధ్యమవుతుందని తెలిపారు.
ఇల్లందు అభివృద్ధి సంక్షేమంలో అగ్రగామిగా ఉందని సీఎం కేసీఆర్ ఇల్లందు నియోజకవర్గపై ప్రత్యేక అభిమానంతో అత్యధిక నిధులతో అభివృద్ధి పనులు చేయించారని, అలాగే ఇల్లందుకు ఎంతో ముఖ్యమైన సీతారామ ప్రాజెక్టు కోసం 3320 కోట్లు మంజూరు చేశారు. పట్టణ ప్రజల చిరకాల కోరిక అయినా బస్ డిపో మంజూరు చేసి వారి కలను సాకారం చేశారన్నారు. ఆత్మీయ సమ్మేళనం ద్వారా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు అందుతున్న ఫలాలపై ఆత్మీయ సమ్మేళనం ద్వారా ప్రజలకు పోవుటకు ప్రణాళిక ప్రకారం సైనికులు లాగా పని చేయాలని కోరారు. ఇల్లందు నియోజకవర్గ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అధికార పార్టీ గెలిచిన దాఖలాలు లేవని అలాగే ఆడబిడ్డగా వచ్చి గెలిచానని ఈసారి గులాబీ జెండా ఎగరవేసిన అధికార పార్టీ అభ్యర్థిగా గెలిచి ఇల్లందు చరిత్ర తిరగరాయాలంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటెయ్యాలని రాష్ట్రంలో ప్రతి ఇంటికి పథకాలు ద్వారా లబ్ధిదారులు ఉన్నారు.
రాష్ట్రంలో 100 కు పైగా సీట్లను బీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంటుంది అనీ గతంలో పార్టీ ద్వారా లబ్ధి పొంది గ్రామాల్లోకి స్వార్ధ రాజకీయాలకు తెర లేపుతూ మాయమాటలతో మభ్యపెట్టే విధంగా మాట్లాడుతున్న వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మండల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బోడు గ్రామ పంచాయతీ సెంటర్ నుండి పాఠశాల గ్రౌండ్ వరకు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, రైతుబంధు రాష్ట్ర సభ్యులు పులిగండ్ల మాధవరావు, ఏఎంసీ చైర్మన్ బానోత్ హర్సింగ్ నాయక్, జనగం కోటేశ్వరరావు, ఎంపీపీ భూక్యా రాధా, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మేర్ల వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్, బానోత్ రామా నాయక్, ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ, లక్కినేని శ్యాంబాబు, కంభంపాటి చంద్రశేఖర రావు, స్థానిక సర్పంచ్ లు ఇర్ఫా లక్ష్మీనారాయణ, ఈసం ఉపేందర్ బాబు, చింతా మంగమ్మ, బానోత్ విజయ, జెబ్బ విజయలక్ష్మి, ఎంపీటీసీ చింతా శాంతకుమారి, మౌలానా, భూక్యా సైదులు నాయక్, బానోత్ రవికుమార్, చింతా వెంకన్న, పేరాల రమేష్, వెంకటసుబ్బయ్య, ఎట్టి ప్రసాద్, ఇస్లావత్ బాలు నాయక్, బర్మావత్ శివ కృష్ణ, జాటోత్ నరేష్, జర్పుల లచ్చు నాయక్, శ్యామ్, నర్సింగ్, సుదీప్, గుగులోత్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.