వాస్తవ కథనాలలో దిశ ఫస్ట్.. ఎస్ఐ వరాల శ్రీనివాస్

by Javid Pasha |
వాస్తవ కథనాలలో దిశ ఫస్ట్.. ఎస్ఐ వరాల శ్రీనివాస్
X

దిశ, తిరుమలాయపాలెం: సమాజంలో జరుగుతున్న అనేక అక్రమాలపై వాస్తవ కథనాలు ప్రచురించడంలో దిశ పత్రిక అన్నీకంటే ఫస్ట్ ఉంటుందని రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ చావా శివరామకృష్ణ, ఎస్సై వరాల శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఎస్సై శ్రీనివాస్, రైసాస మండల కన్వీనర్ శివరామకృష్ణ 'దిశ పత్రిక' నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో అనేక సమస్యలపై వాస్తవ కథనాలు ప్రచురిస్తూ, దిశ అనంతకాలంలోనే ఎంతో ప్రజాదరణ పొందిన పత్రిక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దిశ పత్రిక తిరుమలాయపాలెం మండల రిపోర్టర్ పోలెపొంగు నాగరాజు, ఏఎస్సై రాఘవయ్య, సీపీఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు గుగ్గిళ్ళ అంబేద్కర్, మండల కోఅప్షన్ సభ్యుడు సైఫుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు ఉపేందర్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

.



Next Story

Most Viewed