- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
టిప్పర్ బోల్తా.. 2 గంటలు ఇరుక్కుపోయిన డ్రైవర్
by samatah |

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : అతివేగం డ్రైవర్ ప్రాణం మీదకు తెచ్చింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుఝామున జరిగింది. లక్ష్మణ్ అనే డ్రైవర్ టిప్పర్ లారీ నడుపుతూ రాజేంద్రనగర్ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వైపు వెళ్తున్నాడు. వేగం ఎక్కువగా ఉండటంతో లారీని లక్ష్మణ్ అదుపు చెయ్యలేకపోయాడు.దాంతో అది రింగురోడ్డు పై నుంచి దాదాపు పది అడుగుల కింద ఉన్న సర్వీస్ రోడ్డుపై పడిపోయింది. విషయం తెలిసి అక్కడికి వెళ్లిన పోలీసులు రెండు గంటలు శ్రమించి అతన్ని క్యాబిన్ నుంచి బయటకు తీశారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు.
Next Story