- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నేలకొండపల్లిలో పట్టపగలే మూడు చోరీలు

దిశ,నేలకొండపల్లి : మండల కేంద్రంలో పట్టపగలే మూడు వరుస చోరీలు జరిగిన ఘటన చోటు చేసుకుంది. ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ గా పని చేస్తున్న యడవల్లి ఉషారాణి అనే మహిళ ఇంట్లో బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఉషారాణి ఇంట్లో బీరువాలో ఉన్న సుమారు రూ. 5 లక్షల విలువైన రెండు తులాల నెక్లెస్, రెండు చైన్లు, రెండు ఉంగరాలను, కొంత నగదును అపహరించుకెళ్లారు. ఇంట్లోకి వచ్చిన ఉషారాణి బీరువా తెరిచి వస్తువులు చిందర వందరగా పడి ఉండడంతో గమనించి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
అలాగే మండలంలోని రాయినిగూడెం గ్రామంలో కాలంగి బ్రహ్మం అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువా తెరిచి రూ.50 వేలు ఎత్తుకెళ్లారు. పొలానికి వెళ్లిన బ్రహ్మం ఇంటికి వచ్చి బీరువా తెరిచి ఉండడంతో అనుమానంతో చెక్ చేసుకోగా డబ్బు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అచర్ల గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని మాటల్లోకి దించి అతని ఫోన్ ఎత్తుకెళ్లారు. ఒకే రోజు మూడు ఘటనలు జరగడంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. త్వరితగిన వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వరుస చోరీ ఘటనలపై వేరువేరుగా ఫిర్యాదులు అందుకున్న నేలకొండపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.