తీవ్ర విషాదం.. స్నానానికి వెళ్లి గోదావరిలో ముగ్గురు గల్లంతు

by Satheesh |   ( Updated:2022-05-20 14:53:16.0  )
తీవ్ర విషాదం.. స్నానానికి వెళ్లి గోదావరిలో ముగ్గురు గల్లంతు
X

దిశ, బూర్గంపాడు: బూర్గంపాడు మండలం మోతె పట్టినగర్ వద్ద గోదావరిలో స్నానానికి దిగి ముగ్గురు గల్లంతైన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బూర్గంపాడు మండలం మోతె పుష్కర్ ఘాట్ వద్ద చంద్రుగొండకు చెందిన నరసింహారావు తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో స్నానానికి దిగి నది ప్రవాహానికి గల్లంతైయ్యారు. గమనించిన స్థానికులు ఇమ్రాన్ అనే బాబును రక్షించారు. నరసింహారావు, భార్య రిహానా, కుమారుడు ఇర్ఫాన్ ఆచూకీ లభ్యం కాలేదు. వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. సమాచారం అందుకున్న బూర్గంపాడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సమయం కావడంతో.. సహయక చర్యలకు ఆటంకం కలుగుతుందని పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed