ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జననం

by Sridhar Babu |
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జననం
X

దిశ, భద్రాచలం : భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. చత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బట్టిగూడెం గ్రామానికి చెందిన పొజ్జ అనే గిరిజన మహిళ కాన్పు కోసం ఈనెల 2వ తేదీన భద్రాచలం ఏరియా వైద్యశాలలో చేరింది. పరీక్షించిన వైద్యులు కాన్పుకు సమయం ఉండడంతో మహిళను ఆసుపత్రిలో ఉంచి చికిత్సను అందించారు.

బుధవారం నొప్పులు రావడంతో వైద్యులు సుఖ ప్రసవంకు ప్రయత్నం చేశారు. ముగ్గురు పిల్లలు జన్మించారని, ముగ్గురూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా పొజ్జ కు ఇది 8 వ కాన్పు కావడం విశేషం. ఇంతకు ముందు కాన్పులలో జన్మించిన ఏడుగురు పిల్లలు కూడా క్షేమంగానే ఉన్నారు. బుధవారం జరిగిన 8వ కాన్పులో ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో పొజ్జ ఆమె భర్త దేవా కు మొత్తం ఐదుగురు మగపిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు.



Next Story

Most Viewed