న్యాయవాద దంపతుల పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

by Disha Web Desk 1 |
న్యాయవాద దంపతుల పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
X

దిశ, ఖమ్మం: న్యాయవాద దంపతులపై అమానుషంగా దాడి చేసిన నేలకొండపల్లి సీపీఐ మండల కార్యదర్శి కర్నాటి భానుప్రసాద్, అనుచరును అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిచాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం హైదరాబాద్ లోని హోంమంత్రి కార్యాలయంలో మంత్రి మహమూద్ అలీని కలిసి ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఈ కర్యక్రమంలో ఐక్యవేదిక చైర్మన్ డాక్టర్ కేవీ.కృష్ణారావు, కన్వీనర్ గుంతేడి వీరభద్రం, కో-కన్వీనర్లు, షేక్ అబ్దుల్ రహమాన్, బానోత్ బద్రూనాయక్, పద్మాచారి, ఆర్.పీ.ఐ పార్టీ ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ నగరికంటి సంజీవరావు, పెరుగు వెంకటరమణ యాదవ్, గుండెపోగు అఖిల్, ఐక్యవేదిక మహిళా నాయకులు,ఉపేంద్రనాయక్, రమ్య తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed