- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇది స్కూలా...చెరువా....

దిశ, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఒక్క వర్షానికే నీళ్లు నిలిచి చెరువును తలపిస్తుంది. స్కూలుకు వచ్చిన విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ స్కూల్ భవనం శిథిలావస్థకు చేరింది. విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు మనబడి కార్యక్రమంలో నూతన తరగతి గదుల నిర్మాణానికి 39 లక్షలు మంజూరు చేసింది.
పనులు చేసేందుకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్మాణ పనులను అస్తవ్యస్తంగా పూర్తి చేశాడు. వర్షాలకు శిథిలావస్థకు చేరిన భవనం నుంచి కొత్త బిల్డింగ్ లోకి మార్చేందుకు పాఠశాల విద్య ఇంజినీరింగ్ శాఖ (టిఎస్ఈడబ్ల్యూఐడిసి ) ఎలాంటి చొరవ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే బురద నీటిలో నుంచి నడవాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.