- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూడాలి : మంత్రి అజయ్ కుమార్

దిశ, ఖమ్మం సిటీ : రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని తల్లాడ మండలం మిట్టపల్లి క్లస్టర్ రేజర్ల కొనుగోలు కేంద్రంలో ధాన్య కొనుగోలు కేంద్రాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ లతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, వారి సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. పుష్కలమైన సాగు నీరు, ఉచిత నాణ్యమైన విద్యుత్తు అందించడంతో జిల్లాలో గతంలో కంటే వరి సాగు చాలా పెరిగిందన్నారు.
అధికారుల అంచనాల ప్రకారం ఈ సీజన్ లో 5.37 మెట్రిక్ టన్నుల సాగు చేశారని, ఇందులో 4.03 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే అవకాశం ఉందని అన్నారు. అంచనాలకు అనుగుణంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 230 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అవసరాన్ని బట్టి ఇంకా పెంచుతామని అన్నారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులు పండించిన చివరి గింజను ప్రభుత్వమే కొని వారి ఖాతాల్లో నగదును జమ చేసిన విషయం మంత్రి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, కల్లూరు ఆర్డీవో సిహెచ్. సూర్యనారాయణ, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సోములు, వ్యవసాయ శాఖ ఏడి సునీత, తల్లాడ ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీలత, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.