పీపుల్స్ మార్చ్ ముగింపు సభకు భారీగా తరలి రావాలి

by Sridhar Babu |
పీపుల్స్ మార్చ్ ముగింపు సభకు భారీగా తరలి రావాలి
X

దిశ, ముదిగొండ : హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రంలో చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభకు భారీగా తరలిరావాలని ఖమ్మం జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శ్రీనివాస్ గౌడ్ కోరారు. మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు మండల పరిధిలోని కమలాపురం గ్రామంలో శనివారం మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు వల్లూరి భద్రారెడ్డి అధ్యక్షతన మండల కిసాన్ కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల కిసాన్ కాంగ్రెస్ నూతన కమిటీ ఏర్పాటుతో పాటు రైతుల సమస్యలపై పలు తీర్మాలను ఆమోదించారు. మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా వల్లూరి భద్రారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోగా వీరితో పాటు కమిటీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరూ రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రైతులకు అండగా ఉండాలన్నారు. రైతుల పార్టీ అంటే కేవలం కాంగ్రెస్ పార్టీనే అని, ఈ నెలలో ఖమ్మంలో జరిగే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు మండల కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండలం నుండి భారీగా రైతులు, అభిమానులు, కార్యకర్తలు, మండల‌ ప్రజలు తరలిరావాలన్నారు. ఈ సమావేశంలో మధిర నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు కందిమల్ల వీరబాబు, కాంగ్రెస్ పార్టీ ముదిగొండ మండలం సీనియర్ నాయకులు ఇలవల పుల్లారెడ్డి, జోన్ ఇన్చార్జిలు పసుపులేటి దేవేంద్రం, పందిరి అంజయ్య, పిల్లుట్ల రాఘవ, మల్లెల అజయ్, అయ్యగారి పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మట్టా బాబు, రామిరెడ్డి పాల్గొన్నారు.



Next Story

Most Viewed