ప్రయాణికులకు నిలువ నీడ లేదు..

by Sumithra |
ప్రయాణికులకు నిలువ నీడ లేదు..
X

దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లి బంజరు గ్రామంలో మూడు దశాబ్దాల క్రితం ప్రధాన సెంటరులో రోడ్డు పక్కన రేకుల షెడ్డు బస్టాండ్ ఉండేది. ఆ తర్వాత రెండు రోడ్ల మధ్యలో పాల్వంచ లయన్స్ క్లబ్ అధ్వర్యంలో ప్రయాణికుల కోసం బస్టాండ్ నిర్మించారు. అభివృద్ధి క్రమంలో జరిగిన జాతీయ రహదారి విస్తరణలో బస్టాండును తొలగించారు.

రోడ్డు విస్తరణ పెరగడంతో బస్టాండ్ నిర్మించేందుకు స్థలం లేక తిరిగి నిర్మించలేదు. దీంతో ప్రయాణీకులు ఎండనక, వాననక నిలువ నీడలేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులుగాని, ప్రజాప్రతినిధులు గాని బస్టాండ్ నిర్మించేందుకు దృష్టి సారించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల సౌకర్యార్థం బస్టాండ్ నిర్మించాలని మోరంపల్లిబంజర గ్రామస్తులు వేడుకుంటున్నారు.



Next Story

Most Viewed