చికిత్స పొందుతూ యువకుడు మృతి

by Kalyani |   ( Updated:2022-11-25 04:08:27.0  )
చికిత్స పొందుతూ యువకుడు మృతి
X

దిశ, తిరుమలాయపాలెం : తండ్రి మందలించాడని మనస్థాపానికి గురై క్రిమిసంహారక మందు తాగిన ఓ యువకుడు గురువారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. మండలంలోని మహమ్మదాపురం శివారు భూక్యాతండాకు చెందిన భూక్యా చైతన్య (18) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కాలేజీకి వెళ్లకుండా ఇంటి వద్దే ఉండడంతో, కాలేజీకి వెళ్లాలంటూ తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన చైతన్య ఈనెల 22వ తేదీన క్రిమిసంహారక మందు తాగాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూన్నాడు. ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం మరణించాడు. మృతుడి తండ్రి బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed