- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం...

దిశ, నేలకొండపల్లి : జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, రూరల్ మండలాల్లో ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారివర్షం సంభవించింది. భారీగా ఈదురు గాలులు వీయడంతో ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి. మరికొన్ని దెబ్బతిన్నాయి. వర్షం ప్రభావంగా మరోవైపు కళ్లల్లో ధాన్యాన్ని ఉంచిన రైతులు వర్షం రాకతో కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులు పెట్టల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో తమ ధాన్యాన్ని, మొక్కజొన్న, కొనుగోలు చేయలేదనీ ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని విమర్శిస్తున్నారు. అకాల వర్షాల కారణంగా వచ్చిన వరదల్లో రోడ్డు పై ఆరబెట్టిన మక్కలు కొట్టుకుపోయాయి.
భారీ వర్షానికి ఈదురుగాలులు కూడా తోడవ్వడంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సేవలను పునరుద్ధరించడం చేయాల్సి ఉంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సేవలు నిలిచిపోయాయి. భారీ వర్ష సూచన ఉన్నట్లు అటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి హెచ్చరిస్తూనే ఉంది. సుమారు గంటకు 30కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని చెప్పింది. అయినప్పటికీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అటు పలుచోట్ల పిడుగులు సంభవించాయి. దీనితో ప్రజలు భయాందోనల చెందుతున్నారు.