- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మునుగోడు ముగిశాక పే స్కేల్.. విధుల్లో చేరిన వీఆర్ఏలు

దిశ, కూసుమంచి: గత 80 రోజులుగా నిరవధిక సమ్మె చేసిన వీఆర్ఏలు గురువారం సమ్మె విరమించి విధుల్లో చేరారు. వీఆర్ఏల రాష్ట్ర జేఏసీతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం సాయంత్రం చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో వీఆర్ఏలు సమ్మెను విరమించారు. కూసుమంచి మండల వీఆర్ఏల అధ్యక్షుడు దారా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సీఎస్తో చర్చల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలైన వీఆర్ఏ అందరికీ పే స్కేల్, అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు, 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ లకు వారి స్థానంలో వారసులకు ఉద్యోగాలు కల్పించడం వంటి వాటిని నెరవేరుస్తామని సీఎస్ హామీ ఇచ్చారని తెలిపారు.
ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక కోడ్ ఉన్నందున దాని అనంతరం ఈ హామీలన్నింటిని నెరవేరుస్తామని చెప్పారన్నారు. అంతేగాక సమ్మె కాలంలో వీఆర్ఏల పై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని 30% పీఆర్సీని కల్పిస్తామని కూడా చెప్పారని అన్నారు. ముఖ్యమంత్రి మీద, సీఎస్ సోమేశ్ కుమార్ మీద నమ్మకంతో సమ్మెను విరమిస్తున్నామని తెలిపారు. సమ్మెలో పాల్గొన్న ప్రతి వీఆర్ఏ కు మండల కమిటీ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్పారు. గురువారం వీఆర్ఏలందరూ మండల తహశీల్దార్ మీనన్ కు తెలియపరుస్తూ విధులలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండల వీఆర్ఏలు మాట్లాడుతూ.. 80 రోజుల సమ్మె కాలంలో వారికి సంఘీభావం తెలిపిన వివిధ పార్టీలకు, సంఘాలకు, ఉద్యోగులకు, ప్రజలకు, సహకరించిన అధికారులకు, నాయకులకు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండల ఉపాధ్యక్షుడు రమేష్, కార్యదర్శి అన్వర్ పాషా, ట్రెజరర్ రవికుమార్, అనిల్ కుమార్, మండల వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.