తండ్రిని కొట్టి చంపిన తనయుడు

by Sridhar Babu |
తండ్రిని కొట్టి చంపిన తనయుడు
X

దిశ,కామేపల్లి : భూ పంపిణీ తగాదాల నేపథ్యంలో కన్న తండ్రిని కొడుకు కొట్టి చంపిన సంఘటన కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సై పి.ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. లకావత్ సక్రు (65) పెద్ద కుమారుడు లకావత్ నాగేశ్వరరావు భూ తగాదాల నేపథ్యంలో కొట్టి రోడ్డుపై పడవేశాడు.

దాంతో సక్రు మృతి చెందాడు. తనకు ఉన్న ఎకరం భూమిని ఇరువురు కొడుకులకు సమానంగా పంచుతానని తండ్రి స్పష్టం చేయగా అందుకు అంగీకరించని పెద్ద కుమారుడు వాగ్వివాదము, ఘర్షణ కు పాల్పడ్డాడు.ఈ నేపథ్యంలోనే తండ్రిని బలంగా కొట్టడంతో మృతి చెందాడు. మృతుని భార్య లాలి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.ప్రవీణ్ కుమార్ తెలిపారు.



Next Story

Most Viewed