ఆర్టీసీ బస్సు ఢీ.. అక్కడికక్కడే యువకుడు మృతి

by Dishanational4 |
ఆర్టీసీ బస్సు ఢీ.. అక్కడికక్కడే యువకుడు మృతి
X

దిశ, కామేపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుగొండ బస్టాండ్ సెంటర్ శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కామేపల్లి గ్రామానికి చెందిన భానోత్ నరేష్(28) పని నిమిత్తం వెళ్తుండగా.. ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దాంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed