- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైనది
by Sridhar Babu |

X
దిశ, మధిర : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు చాలా విలువైనదని, దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్డీఓ గణేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మధిర నియోజవర్గ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలక్షన్ కమిటీ ఆదేశాల మేరకు మండలాల స్థాయిలో శనివారం ఉదయం 6:00 గంటలకు
విద్యార్థులు, ప్రజలతో 5 K రన్ నిర్వహిస్తున్నట్లు, ఓటు హక్కు పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల పై ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలో డెమో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐ వసంత కుమార్, ట్రైనీ ఐపీఎస్ అధికారి అవినాష్ కుమార్, ఐదు మండలాల తహసీల్దార్లు, ఎస్సైలు పాల్గొన్నారు.
Next Story