- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాలేరులో ఎర్రజెండా ఎగరడం ఖాయం.. తమ్మినేని వీరభధ్రం

దిశ, ఖమ్మం, రూరల్: టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పొత్తులతో పాలేరులో ఎర్రజెండా ఎగరడం ఖాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం రూరల్ మండలం ముత్తగూడెంలో పార్టీ విస్త్రత స్థాయి సమావేశానికి హజరైన ఆయన పలు వాఖ్యలు చేశారు. రాబోవు రోజుల్లో రాష్ట్రంలో సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్ కలిసి పొత్తులతో ఒక్క సీటు కూడ ఓడిపోకుండా ఉండేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే పాలేరులో కూడ పూర్వపు రోజులు వచ్చే అవకాశం ఉందన్నారు. పాలేరు పార్టీ పోటీ చేయడం ఖాయంగా ఆయన తెల్చారు. డబ్బురాజకీయాలు ఎల్లకాలం రాజకీయం చేస్తాయని అన్నారు. ఒకప్పుడు తెలుగుదేశం జిల్లాలో నెంబర్ వన్గా ఉందని ఇప్పుడు జీరోగా మిగిలిందన్నారు.
మోడీలను ఓడించాలంటే కమ్యూనిస్టులను అవసరమని గుర్తించిన సీఎం కేసీఆర్ మునుగోడులో అవిధమైన పాచికపారిందన్నారు. దళితంబందు అక్కడక్కడ ఇచ్చాడని, బీజేపీ ఓడించే క్రమంలో పొత్తులు ఉంటాయని, అదే విధంగా సీఎం కేసీఆర్ హమీలు అమలుకు పోరాటం తప్పదన్నారు. ఇంకో సంవత్సరంలో ఎన్నికలు వస్తాయని ఖమ్మం, నల్లగొండలో మన బలలాలకు తగ్గట్టుగా సీట్లు పంపకాలు ఉంటాయన్నారు. ఖమ్మం, నల్లగొండలో ఒక్కసీటు వదలకుండా గెలవాలన్నారు. పాలేరులో ఎర్రజెండా ఎగరవేయడం ఖాయమని, పట్టుదలతో పనిచేయాలని, వేరేచోట సీపీఐ, టీఆర్ఎస్లకు కూడ మద్ధతు తెలపాలని వాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు పాలేరులో సీపీఎం పోటీ చేస్తుందా..? చేయదా..? అనే మీమాంసకు తమ్మినేని వాఖ్యలు తెరిదించనట్లైంది. ఇక సిట్టింగ్లకు కష్టాలు తప్పవని తెలుస్తోంది. ఆదివారం 'దిశ'లో వచ్చిన కథనం అక్షరాల సత్యమని పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకోవడం విశేషంగా చెప్పాలి.