కోళ్లను మింగిన కొండచిలువ

by Sridhar Babu |
కోళ్లను మింగిన  కొండచిలువ
X

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో ఇర్ఫాన్ చికెన్ షాప్ లోకి కొండచిలువ చొరబడింది. యజమాని సయ్యద్ ఇర్ఫాన్ పాషా బుధవారం ఉదయం షాపు తెరిచి చూడగా కోళ్లను మింగుతూ భారీ కొండచిలువ కనిపించింది. దాంతో భయభ్రాంతులకు గురై విషయాన్ని స్థానిక ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించాడు. ఫారెస్ట్ సిబ్బంది స్నేక్ క్యాచర్ ను తీసుకొచ్చి కొండచిలువను పట్టుకుని చికెన్ షాప్ నుంచి బయటకు తీసుకువచ్చారు. అప్పటికే మింగి ఉన్న రెండు కోళ్లను కొండచిలువ నుంచి కక్కించారు. అనంతరం కొండచిలువను అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.



Next Story