రెండో ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి

by Sridhar Babu |
రెండో  ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి
X

దిశ, భద్రాచలం : గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4500 మంది రెండో ఏఎన్ఎంలు తమ సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న సమ్మె శిబిరాన్ని శనివారం భద్రాచలంలో సీపీఐ పట్టణ కార్యదర్శి అకొజు సునీల్ కుమార్ ప్రారంభించారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా వెలకట్టలేని సేవలను అందిస్తున్న రెండో ఏఎన్ఎం సమస్యలను రాష్ట్రవ్యాప్తంగా పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే చర్చకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed