మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

by Sridhar Babu |
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
X

దిశ, మధిర : మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కు వినతి పత్రం అందజేశారు. పెండింగ్ బిల్లులు తక్షణం విడుదల చేయాలని, గతంలో కేటాయించిన బడ్జెట్ సరిపోవడం లేదని విన్నవించారు. 2022 మార్చి 15న ముఖ్యమంత్రి అసెంబ్లీలో మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.2000 పెంచుతున్నట్లు ప్రకటించారని,

ఆ జీఓ ఇవ్వడానికి తీవ్రమైన జాప్యం చేస్తున్నరని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమస్య లు పరిష్కరించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో సీఐటీయూ మధిర మండల కన్వీనర్ పడకంటి మురళి, మధ్యాహ్న భోజన కార్మికులు ధనలక్ష్మి కృష్ణకుమారి, రమాదేవి, చిన్ని, సీతారామ, మస్తాన్ బి మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed