- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మణిపూర్ మారణహోమం పై రాష్ట్రపతి, ప్రధాని స్పందించాలి

దిశ, వైరా : మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసీ మహిళల పై అత్యాచారాలు, హత్యలు, నగ్నంగా ఊరేగింపు ల పై రాష్ట్రపతి, ప్రధాని వెంటనే స్పందించి మణిపూర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో వైరా లో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మైతే , కుకీ తెగల మధ్య చిచ్చు పెట్టి మారణహోమం కు కారణమయ్యారని విమర్శించారు.
మహిళల పై జరుగుతున్న అకృత్యాలు వలన దేశం సిగ్గు పడుతుందన్నారు. నరేంద్ర మోడీ మౌనం వీడి మణిపూర్ ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ బొంతు సమత, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు చింతనిప్పు చలపతిరావు, మల్లెంపాటి రామారావు, సినీయర్ నాయకులు పారుపల్లి కృష్ణారావు, పారుపల్లి శ్రీనాధ్, మల్లెంపాటి ప్రసాద్, కమిటీ సభ్యులు కొంగర సుధాకర్, బేగ్ రోషన్, గుడిమెట్ల మోహన్ రావు, తోట కృష్ణవేణి, సుగుణమ్మ యనమద్ది రామకృష్ణ, పల్లెబోయిన కృష్ణ, అఫ్జల్, నాగుల్ పాషా, వడ్లమూడి మధు,ఎస్డి పాషా, బాబు పాల్గొన్నారు.