- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రధాని పాలనపై దేశ ప్రజలకు విశ్వాసం ఉంది

దిశ, ఖమ్మం రూరల్ : రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే ప్రవాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగా పాలేరు నియోజకవర్గంలో ఏడు రోజుల పాటు పర్యటించేందుకు ఆదివారం ఒడిస్సా రాష్ట్రం బ్రహ్మగిరి ఎమ్మెల్యే ఎల్బీ మహాపాత్రో ఏదులాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు. ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ, నియంతృత్వ పాలనకు ప్రజలు విసిగిపోయారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని, కార్యకర్తలంతా కష్టించి పనిచేయాలని కోరారు.
ఏడు రోజుల పాటు ఇక్కడే ఉండి అన్ని మండలాలు, కార్పొరేషన్ పరిధిలోని మూడు డివిజన్లలో పర్యటిస్తానని చెప్పారు. ఈ నెల 27వ తేదీన ఖమ్మంలో నిర్వహించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తక్కెళ్ళపల్లి నరేంద్ర రావు, పాలేరు అసెంబ్లీ కన్వీనర్ మేక సంతోష్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనంత ఉపేందర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు గుండా శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నూకల రామ్మోహన్ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోటమర్తి సుదర్శన్, మండల అధ్యక్షులు బొడ్డుపల్లి ప్రసాద్, మల్లారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నలమాస శ్రీనివాస గౌడ్, దాసరి వెంకటేశ్వర్లు, రాసాల రవి, పాగర్తి సుధాకర్, వేగినాటి రాంబాబు, కొమరాబత్తిని వెంకన్న, మోయిన్ తదితరులు పాల్గొన్నారు.