- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మోరే రవిపై పెట్టిన పీడీ యాక్ట్ ను వెంటనే రద్దు చేయాలి
సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు
దిశ, గుండాల: సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యుడు, భద్రాచలం డివిజన్ కార్యదర్శి మెరె రవిపై అశ్వాపురం పోలీసులు అక్రమంగా విధించిన పీడీ యాక్ట్ ను వెంటనే రద్దు చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అవునూరి మధు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం డిమాండ్ చేశారు.శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. మోరే రవి భద్రాచలం డివిజన్ ప్రాంతంలో బలమైన ప్రజా ఉద్యమాన్ని నడిపి0, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే పోడు సాగుదారులకు పట్టాలు వెంటనే ఇవ్వాలని, గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు ఎత్తైన ప్రదేశంలో ఇళ్ల స్థలాలను కేటాయించాలనే లక్ష్యంతో పోరాడుతున్న రవి దగ్గర ఆయుధం దొరికినట్లుగా కథను సృష్టించి కేసులు నమోదు చేసి జైలుకు పంపారని ఆరోపించారు. మోరే రవి పై పెట్టిన పీడీ యాక్ట్ ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులకు వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల సర్పంచ్ కొమురం సీతారాములు, న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి అరేం నరేష్, పరిషిక రవి, యాససారపు వెంకన్న, ఇసం కృష్ణన్న, గడ్డం లాలయ్య, ఎస్.కె.అజ్గర్, బానోతు లాలు, బుక్య వెంకన్న, తదితరులు పాల్గొన్నారు