- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మైనింగ్ అధికారి అవినీతి బాగోతం

దిశ ప్రతినిధి,కొత్తగూడెం:ప్రతినెల లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు.తాము చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేయకపోగా ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు కాస్త వసూళ్ల పర్వానికి తెరలెప్పుతున్నారు.ఉన్నతాధికారి హోదాలో ఉంటూ క్రింది స్థాయి సిబ్బందిని మధ్యవర్తులుగా మారుస్తూ తాము చేస్తున్న వసూళ్లకు ఆనవాళ్లు లేకుండా పాదరసంలా జారిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనింగ్ డిపార్టుమెంటులో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి తనకు ప్రభుత్వం ఇస్తున్న జీతం సరిపోవడం లేదు అనుకున్నాడో ఏమో కానీ వసూళ్ల పర్వానికి తెర లేపాడు.
నిత్యం లక్షల్లో వసూల్లు..ఈ మైనింగ్ అధికారి ఒక్కసారి తన ఆఫీసు గేటు దాటి ఫీల్డ్ మీదకు వెళితే అక్రమార్కులకు వెన్నులో వణుకు పుట్టాల్సిందేనట.క్వారీలు,ఇటుక బట్టీలు,అనుమతికి మించి తరలిస్తున్న ఇసుక లారీల వరకు సారుకు ముడుపులు ముట్ట చెబితే తప్ప పనులు ముందుకు సాగవని తెలుస్తోంది.జిల్లాలో అక్రమ మైనింగ్ ఏ మారుమూల జరిగినా ఈ అవినీతి అధికారికి తాను అడిగినంత ముడుపులు ముట్ట చెబితే తప్ప పనులు సాఫీగా సాగవని జిల్లా వ్యాప్తంగా చర్చ లేకపోలేదు. ఒక్కసారి ఈ సారుకు చిక్కితే అంతే సంగతులు తాను అడిగినంత డబ్బులు ముట్ట చెబితే తప్ప వారి పనులు సాఫీగా తాగే పరిస్థితి కనబడడం లేదని అనేకమంది బాధితులు వాపోతున్నారు.సదరు మైనింగ్ అధికారి ప్రతి పనికి ఒక రేట్ ఉంటుందట.బేరమాడినా బ్రతములాడిన సారు కోపోద్రిక్తులై శపించినంత పని చేస్తారట.
డ్రైవర్ కం అటెండర్ తో రాయబారాలు,క్షణంలో సెటిల్మెంట్లు..
జిల్లా వ్యాప్తంగా ఎక్కడ మైనింగ్ జరిగినా,ఇటుక బట్టిల నుండి ఇసుక వరకు ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా వసూళ్ల పర్వానికి తెర తీసిన ఈ మైనింగ్ అధికారి. తన వద్ద పనిచేస్తున్న కింది స్థాయి డ్రైవర్ కం అటెండర్ ను రాయబారిగా వాడుకుంటూ లక్షల్లో అవినీతి సంపాదనను మూటగట్టుకుంటున్నాడు.ఈ మైనింగ్ అధికారి కన్ను పడిందంటే మొదట తనకు సన్నిహితంగా ఉన్న ఉద్యోగిని రాయబారానికి పంపిస్తాడు రాయభారానికి వెళ్లిన సదరు కిందిస్థాయి ఉద్యోగి సారు మీ మీద కోపంగా ఉన్నారు అర్జంటుగా వెళ్లి కలవండి లేదంటే చాలా ఇబ్బంది పడతారు అంటూ ఒక కబురు పంపించి, తన మనసులో ఉన్న మాటని తన డ్రైవర్ ద్వారా అవతలి వారికి చేరవేసి లక్షల్లో లంచాలు పుచ్చుకుంటాడు.ఒకవేళ మాట వినకుంటే నిబంధనల ప్రకారమే డ్యూటీ చేస్తానంటూ పట్టపగలే అరుంధతి నక్షత్రాలు చూపుతాడని జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది.ఇతగాడు ఏ ఒక్క రూపాయి లంచం తీసుకోవాలన్న తన స్వహస్తాలతో తీసుకోకుండా క్రింది స్థాయి సిబ్బందిని పావులా వాడుతూ వచ్చిన లంచపు సొమ్ములో కాస్త కూసో క్రింది స్థాయి సిబ్బందికి ముట్ట చెప్పి వ్యవహారం బయటికి పోకుండా నోరు మూయిస్తారు.ఉన్నత స్థాయి మైనింగ్ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన విధులను మరచి లంచగొండి అవతారం ఎత్తిన ఈ మైనింగ్ ఉన్నతాధికారిపై సరైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కొంతమంది బాధితులు కోరుతున్నారు.