- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పసికందు మృతికి వైద్య సిబ్బందే కారణం...బాధిత కుటుంబం ఆరోపణ

దిశ, కారేపల్లి : వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే తమ బిడ్డ మృత్యువాత పడిందంటూ బాధిత కుటుంబికులు గురువారం కారేపల్లి పీహెచ్సీ వైద్యాధికారి యాసా హన్మంతరావును నిలదీశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి మండలం శాంతినగర్ కాలనీకి చెందిన జజ్జర అనూష ఈనెల 11వ తేదీ తెల్లవారుజామున పురిటి నొప్పులతో పీహెచ్సీకి వచ్చింది. పీహెచ్సీలో ఉన్న ఏఎన్ఎం కాన్పు చేస్తుండగా బిడ్డ కాళ్లు మాత్రమే బయటకి వచ్చి ఆగిపోయాయి. కాన్పుకు ఎక్కువ సమయం తీసుకోవటంతో పుట్టిన బిడ్డలో చలనం లేకుండాపోయింది. వెంటనే 108 ద్వారా బిడ్డను ఖమ్మం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషయమై గురువారం కుటుంబ సభ్యులు తుడుందెబ్బ నాయకులతో కలిసి వైద్య సిబ్బందిని నిలదీశారు. సిబ్బంది నిర్లక్ష్యంతో బిడ్డ మృతి చెందిందని ఆరోపించారు. దీనిపై మండల వైద్యాధికారి వై.హన్మంతరావు వివరణ ఇస్తూ అనూష మెడికల్ రిపోర్టు ప్రకారం సాధారణ కాన్పు అవకాశం లేదన్నారు. ప్రధాన ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో జాప్యం జరిగిందని తెలిపారు. జాప్యం ఎక్కడ, ఎవరి వల్ల జరిగింది అనే దానిపై విచారణ చేయనున్నట్లు పేర్కొన్నారు.