- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆజాద్ పేరుతో లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

దిశ ప్రతినిధి, ఖమ్మం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సమాధాన్ ప్రహర్ దాడిలో భాగంగానే మావోయిస్టు పార్టీపై పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖ విడుదల చేసింది. ఆదివాసీల హక్కులను మావోయిస్టు పార్టీ విహరిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆదివాసీల హక్కులను మావోయిస్టు పార్టీ హరిస్తుందో? రాజ్యం హరిస్తుందో అందరికీ తెలుసని లేఖలో పేర్కొన్నారు.
మావోయిస్టు ఉద్యమం పై ఆరోపణలు చేయడం అంటే అది ఆదివాసీల పై ఆరోపణలు చేయడమే నని అభిప్రాయపడింది. ఆదివాసీ గ్రామాల్లో నిరంతరం కూంబింగ్ చేస్తూ అమాయక ఆదివాసీ ప్రజలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి చిత్రహింసలు పెట్టి, జైలుపాలు చేస్తున్నారని మండి పడింది.
అమాయక ఆదివాసీ యువకులు చేతికి దొరికితే కిరాతకంగా చంపి ఎన్నిసార్లు ఎన్కౌంటర్ కథలు అల్లారని పేర్కొంది. ఆదివాసీల హక్కులు, చట్టాలను నూటికి నూరు శాతం అమలు చేయాలని, మావోయిస్టు పార్టీ మూలంగా ప్రజలకు ఎలాంటి నష్టం లేదని, ఈ ఉద్యమం కేవలం దోపిడీదారులకు వ్యతిరేకంగానే అని పేర్కొంది. ఊరూపేరూ లేని కొన్ని సంఘాలను సృష్టించడం, వాటి ద్వారా దాడులు చేయించడం, నిరాధారమైన ఆరోపణలు చేయించడం పోలీసుల పనే అని.. ఏ సంఘమైన.. పార్టీ అయినా నాయకుల పేర్లతో ప్రకటనలు, కరపత్రాలు, పోస్టర్లు ఉండాలి.
కానీ ఇటీవల మావోయిస్టు పార్టీపై ఆదివాసీ సంఘం పేరుతో చేస్తున్న ఆరోపనల పరంపరలో ఏ నాయకుడు ఈ సంఘానికి నాయకత్వం వహిస్తున్నది లేదన్నారు. ఈ సంఘానికి ఎవరు భాద్యులు గా ఉన్నది ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. ఆకాశరామన్న ఆదివాసీ సంఘం సృష్టి కర్తలు ముమ్మాటికి పోలీసులే అని, ఇలాంటి తప్పుడు సంఘాల మాటలు ప్రజలు ఎవరూ నమ్మవద్దని, వీటిని తిప్పికొట్టాలని ఈ సందర్భంగా మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.