- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
శిథిలావస్థ కు చేరిన కోర్టు భవనంను పరిశీలించిన జడ్జి

దిశ, మధిర : మండల కేంద్రంలోని శిథిలావస్థకు చేరుకున్న మధిర కోర్టు భవనాన్ని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జగజ్జీవన్ కుమార్ సందర్శించారు. అదే విధంగా శిథిలావస్థలో ఉన్న న్యాయమూర్తి నివాస గృహాన్ని పరిశీలించారు. అనంతరం కొత్తగా నిర్మించబోయే కోర్టు భవనం ప్లాన్ ను వీక్షించారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ కమిటీ చైర్మన్ కట్టా పూర్ణచంద్ర రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు భోజడ్ల పుల్లారావు,
వైస్ ప్రెసిడెంట్ నెల్లూరి రవి కుమార్, సెక్రటరీ చావాలి రామరాజు, సీనియర్ న్యాయవాదులు మోహన్ దాస్, నంబూరి జనార్ధన్, పల్లపోతుల కృష్ణారావు, సతీష్, విజయ్ కుమార్ ఆర్అండ్బీ జేఈ రాజేష్, పెనుబల్లి ఆర్అండ్బీ డీఈ శంకర్ రావు, ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ అవినాష్ కుమార్, టౌన్ ఎస్ ఐ రాజేష్, జిల్లా కోర్ట్ నాజర్ రాధే శ్యామ్, కర్లపూడి శ్రీనాధ్, మధిర కోర్టు సూపరింటెండెంట్ వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.