- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉందని భార్యను హత్య చేసిన భర్త

దిశ, దమ్మపేట : కట్టుకున్న వాడే కాల యముడిగా మారాడు. మగ పిల్లవాడు పుట్టలేదని, అలాగే అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉందని, అదనపు కట్నం తీసుకురావడం లేదని భార్యను భర్త హత్య చేసిన ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. ఇటీవల కొన్ని రోజుల క్రితం వడ్లగూడెం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో చల్లా మౌనిక అనే వివాహిత మృతి చెందిన విషయం పాఠకులకు విధితమే. మృతికి సంబంధించిన వివరాలను దమ్మపేట పోలీసులు ఛేదించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను శుక్రవారం అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మీడియాకు వెల్లడించారు.
వడ్లగూడెం గ్రామానికి చెందిన చల్లా నాగేంద్రబాబు అనే వ్యక్తికి కల్లూరు మండలం రామానగరం వీధికి చెందిన గిర్ల మౌనికతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల పాటు వీరి దాంపత్య జీవితం బాగానే సాగింది. దాంతో ఓ పాప పుట్టింది. పాప పుట్టిన దగ్గర నుండి నాగేంద్రబాబు మగ పిల్లవాడు పుట్టలేదని భార్యను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టేవాడు. అదేవిధంగా చల్లా నాగేంద్ర బాబు పలు అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్య మౌనికను మానసికంగా ఇబ్బంది పెడుతూ, అదనపు కట్నం కోసం వేధించేవాడు. భార్య మౌనిక నాగేంద్రబాబు చేస్తున్న పనులకు అడ్డుగా ఉందని భావించి, అదే విధంగా మగపిల్లవాడు పుట్టలేదని ఎలాగైనా ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం ఏప్రిల్ 10వ తేదీ రాత్రి భోజనం అనంతరం భార్యాభర్తలిద్దరూ కలిసి నిద్రించారు.
మౌనిక నిద్రలోకి జారుకున్న తర్వాత భర్త నాగేంద్రబాబు ఆమెను చీరతో మెడకు గట్టిగా మెలవేసి హతమార్చాడు. హతమార్చిన అనంతరం ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా భార్య మౌనిక గుండెపోటు వచ్చిందని చుట్టుపక్కల వారికి సమాచారం అందించి, గ్రామంలో ఉన్న వైద్యుడిని ఇంటికి పిలిచాడు. అనంతరం వైద్యుడు మౌనిక మృతి చెందినట్టు వెల్లడించాడు. అనంతరం భార్య మౌనికను తానే హతమార్చాలని నాగేంద్రబాబు అన్నయ్య దిలీప్, తండ్రి చెన్నయ్యతో జరిగిన విషయాన్ని పంచుకున్నాడు. అందుకు కుటుంబ సభ్యులు అందరూ కలిసి మౌనిక తల్లిదండ్రులకు మీ కూతురు గుండెపోటుతో మరణించిందని, త్వరగా వడ్లగూడెం రావాలని ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
హుటాహుటిన మౌనిక తల్లిదండ్రులు వడ్డెగూడెం చేరుకున్న తర్వాత మౌనిక ఒంటిపై కమిలిన గాయాలను గుర్తించారు. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తమ కూతురు మృతి పై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దమ్మపేట పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టంకు తరలించారు. అనంతరం నాగేంద్రబాబును అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా తన భార్య మౌనికను తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. నాగేంద్రబాబుకు సహకరించిన ఆయన తండ్రి చెన్నయ్య, అన్న దిలీప్పై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని శుక్రవారం రిమాండ్ కు తరలించినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. హత్య కేసును ఛేదించిన దమ్మపేట ఎస్సై శ్రావణ్ కుమార్, సిబ్బందిని సీఐ అభినందించారు.