- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అన్ని విధాలా అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే కందాల

దిశ,తిరుమలాయపాలెం : అధైర్య పడకండి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలో ఆయన ముమ్మరంగా పర్యటించారు. మహ్మదాపురంలోని రైతు ఆగ్రో ఏజన్సీ షాప్ ని ఆయన ఓపెన్ చేశారు. తిరుమలాయపాలెం సొసైటీ ఆధ్వర్యంలో కేశ్వపురం క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా చైర్మన్ కురాకుల నాగభూషణంతో కలిసి ప్రారంభించారు.
రైతులకు అవసరం అయ్యే వ్యవసాయ పరికరాలు ఐకేపీ ద్వారా అద్దెకిచ్చేందుకు తిరుమలాయపాలెం గ్రామంలోని రైతు వేదిక నందు ప్రదర్శనకు ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే కందాల సందర్శించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టి. పాలెం సొసైటీ చైర్మన్ చావా వేణుగోపాలకృష్ణ, ఎంపీపీ బోడ మంగీలాల్, అధికారులు తహసీల్దార్ పుల్లయ్య, ఏవో సీతారాం రెడ్డి, ఎంపీడీఓ జయరాం, ఎస్సై శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బి.వీరన్న,నాయకులు కొప్పుల శ్రీనివాసరావు, పోలేపొంగు వెంకటేశ్వర్లు, చామకూరి రాజు, అంబేద్కర్, ఐకేపీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.