ప్రభుత్వం ముసలి కన్నీళ్లు కారుస్తోంది : బీజేపీ నేత ఈటల

by Sridhar Babu |
ప్రభుత్వం ముసలి కన్నీళ్లు కారుస్తోంది : బీజేపీ నేత ఈటల
X

దిశ,తిరుమలాయపాలెం : నెల రోజులుగా ఐకేపీ సెంటర్లో ధాన్యం ఆరబోసి రైతులు కంటిమీద కునుకులేకుండా ఎదురుచూస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చెయ్యకుండా ముసలి కన్నీరు కారుస్తోందని బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ ఆరోపించారు. బుధవారం మండలంలోని పాతర్లపాడు, బీరోలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, నాయకులకు దావతులు మీద ఉన్న శ్రద్ద రైతులపై లేదని అన్నారు. ఓ పక్క నెలల తరబడి రైతులు కల్లాలని నివాసాలు చేసుకుని పడిగాపులు కాస్తున్నా రైతుల గోడు తీర్చకుండా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో దావతులు చేసుకుంటున్నారని విమర్శించారు. రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదని, ఎద్దు ఏడిస్తే వ్యవసాయం బాగుపడదు అని నీతి కబుర్లు చెప్పిన సీఎం కేసీఆర్, నేడు రాష్ట్రంలో రైతులను ఏడిపిస్తున్నాడని ధ్వజమెత్తారు.అకాల వర్షాలతో వరి పంట నేల రాలితే, రాష్ట్రంలో వరిపంట కొనే నాథుడే లేడని మండిపడ్డాడు. ఖమ్మం జిల్లా మంత్రి, అధికారులు ధాన్యం ఏ మిల్లులకు పోవలో చెప్పలేదని విమర్శించాడు.

600 గ్రాముల తరుగు పేరుతో, మిల్లర్లు 10 కేజీల తరుగు తీస్తున్నారని తెలిసి, ఇదేంటని తాను అసెంబ్లీలో స్వికర్ ని ప్రశ్నించితే 600 గ్రాముల తరుగు మాత్రమే తీస్తున్నామని మాయమాటలు చెబుతున్నారని అన్నారు. నెల నెల జీతాలు తీసుకునే కలెక్టర్లు రైతుల బాధలు తీర్చాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఐదువేల రైతు బంధు ఇస్తే రూ.10వేలు నష్టం వాటిల్లిందని, దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ ప్రభుత్వం వహించి,వెంటనే రైతులని ఆదుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గడల సత్యనారాయణ, జిల్లా నాయకులు తక్కిళ్ళ నరేంద్రరావు, మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి నాగప్రసాద్, నల్లగట్టు శ్రీనివాస్ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.



Next Story

Most Viewed