మిర్చి దళారిని కరెంట్ స్తంభానికి కట్టేసిన రైతులు

by Shiva |
మిర్చి దళారిని కరెంట్ స్తంభానికి కట్టేసిన రైతులు
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటూ తిరుగుతున్న దళారిని కరెంటు స్తంభానికి కట్టేసిన ఘటన సుజాతనగర్ శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలోని మిర్చి రైతుల వద్ద మిర్చి పంటను కొనుగోలు చేసిన కొమ్ముగూడెంకి చెందిన భూక్య శివమణి అనే దళారిని రైతులు తమకు డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదనతో కరెంట్ స్తంభానికి కట్టేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇస్లావత్ రాజు, గుగులోతు రామ, భూక్య నాగకు మూడేళ్లు్గా మొత్తం రూ.5లక్షలు ఇవ్వాల్సింది ఉండగా, తప్పించుకొని తిరుగుతూ రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తన్నాడని బాధితులు ఆరోపించారు, కరోనాతో తన తండ్రి చనిపోయిన సమయంలో కూడా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశాడని ఓ బాధితుడు రాజు తన ఆవేదనను వ్యక్తం చేశాడు . దీంతో విసిగిపోయిన బాధితులు మణి కనిపించడం తో సుజాతనగర్ మెయిన్ రోడ్డు ప్రక్కనే ఒక కరెంటు స్తంభానికి తాళ్లతో బంధించారు, సమాచారం తెలుసుకున్న సుజాతనగర్ పోలీసులు భూక్య శివమణిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.



Next Story

Most Viewed