ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి : ఎమ్మెల్యే సండ్ర

by Sridhar Babu |
ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి : ఎమ్మెల్యే సండ్ర
X

దిశ, సత్తుపల్లి : ప్రతి పరీక్షను విజయవంతంగా పూర్తి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేయాలనే ఆలోచనతో ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ 10 వ తరగతి పేపర్ లీకేజీ లో అడ్డంగా దొరికిన బండి సంజయ్ ను కటినంగా శిక్షించాలి అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పేపర్ల లీకేజీలకు పాల్పడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారన్నారు. పేపర్ లీకులతో రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తుందని మండిపడ్డారు. ఇలాంటి పనులు చేస్తే ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్తారన్నారు. అబదాన్నినిజం చేసే పనిలో ప్రతిపక్షాలు పని చేసున్నాయని, దుష్ప్రచారాలని తిప్పి కొట్టాల​ని పిలుపునిచ్చారు. ఈనెల 11న సత్తుపల్లి పట్టణ పరిధిలో తుమ్మురు రామారావు వీధిలోని స్థలంలో ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించి నియోజకవర్గ నాయకులతో సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో నాయకత్వానికి దిశ నిర్దేశం చేశారు.

ఆత్మీయ సమావేశంలో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఎంపీ నామ నాగేశ్వరరావు , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు , రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ పాల్గొననున్నట్లు తెలిపారు. అభివృద్ధి భౌతిక స్వరూపాన్ని తెలియజేస్తూ ముద్రించిన కరపత్రాలను, కేసీఆర్ ఆత్మీయ సందేశాన్ని, ఆత్మీయ ఆహ్వాన పత్రికలను ప్రతి ఒక్కరికి అందజేసి ఆహ్వానం పలకాలని కోరారు. సత్తుపల్లి పట్టణంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.

వంద పడకల ప్రభుత్వ హాస్పటల్ నిర్మాణం, టూరిజం స్పాట్గా సత్తుపల్లి పట్టణ శివారు చెరువును సుందరంగా మార్చినట్టు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, ఎంపీపీ దొడ్డ హైమావతి శంకర్రావు, జెడ్పీటీసీ సభ్యులు రామారావు, సొసైటీ చైర్మన్ చల్లగుల్ల కృష్ణయ్య, శీలపురెడ్డి రెడ్డి హరికృష్ణ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మోనార్ధ రఫీ, ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకం రాజు, పలువురు వార్డు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed