జీపీ కార్మికుల డిమాండ్​లు నెరవేర్చాలి

by Sridhar Babu |
జీపీ కార్మికుల డిమాండ్​లు నెరవేర్చాలి
X

దిశ, గుండాల : గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గుండాల ఎంపీడీవో ఆఫీస్ ముందు గ్రామ పంచాయతీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు కొమరం శాంతయ్య, పీవైఎల్ మండల కార్యదర్శి, సన్ప, కుమార్ ఆదివారం సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ

కార్మికులు గత 17 రోజులుగా తమ హక్కుల సాధన కోసం నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారని గ్రామపంచాయతీ కార్మికులు అడుగుతున్న డిమాండ్లు సరైనవేనని, వాటిని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. వాళ్ల జీతాలు రూ.19000 కి పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈసం నాగేశ్వరరావు, ఈసం రామారావు, కల్తీ ఆదినారాయణ, ఈసం గోపయ్య పాల్గొన్నారు.



Next Story