మోడీ పాలనలో దేశం పురోగమిస్తోంది : కేంద్ర మంత్రి బీఎల్​ వర్మ

by Sridhar Babu |
మోడీ పాలనలో దేశం పురోగమిస్తోంది : కేంద్ర మంత్రి బీఎల్​ వర్మ
X

దిశ, ఖమ్మం రూరల్​ : భారత ప్రధాని నరేంద్ర మోడీ గత 9 సంవత్సరాల పాలనలో దేశం పురోగమిస్తున్నదని కేంద్ర సహకార ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి బీఎల్ వర్మ అన్నారు. ఆదివారం రూరల్​ మండలం మారెమ్మగుడి ఆలయ పరిధిలో గల ఓ ఫంక్షన్​హల్​లో కేంద్ర పార్టీ పిలుపు మేరకు మహా జనసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పాలేరు అసెంబ్లీ పరిధిలోని బీజేపీ అనుబంధ సంయుక్త మోర్చాల సభ్యుల సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. నరేంద్ర మోడీ పాలనలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి జరిగిందని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మోర్చాల నాయకులదేనన్నారు. సబ్​కా సాథ్ కా వికాస్ సబ్​కా విశ్వాస్ అనే నినాదాలతో పాలన ముందుకు వెళ్తుందన్నారు. భారతదేశంలో ద్రౌపది ముర్ము అనే ఆదివాసిని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదేనని అన్నారు.

పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 27 మంది ఓబీసీ మంత్రులు కేంద్ర క్యాబినెట్ లో ఉన్నారన్నారు. అదేవిధంగా దళిత వర్గానికి సంబంధించిన రామ్​నాథ్​ కోవింద్ రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదేనని చెప్పారు. రైతుల కోసం సబ్సిడీని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ పాత ధరలకే యూరియాను, డీఏపీ ని అందిస్తున్న ఘనత నరేంద్ర మోడీది అన్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయన్నారు. ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులు సూర్యాపేట‌‌-దేవరపల్లి రహదారి, కొరివి- కోదాడ రహదారి, నాగపూర్- అమరావతి రహదారి, ఇబ్రహీంపట్నం నుండి ఖమ్మం జిల్లా మీదుగా వెళుతున్న రాయపూర్ రహదారి ఇలా అనేక జాతీయ రహదారులకు శ్రీకారం చుట్టిన ఘనత నరేంద్ర మోడీదే అన్నారు. గ్రామాలకు అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులను విడుదల చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమే అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా డబుల్ ఇంజన్ సర్కార్ స్ఫూర్తితో మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

మొదటగా బీజేపీ పాలేరు నియోజకవర్గ నాయకులతో కలిసి రెడ్డిపల్లి వద్ద ఆర్కే రెడ్డి ఫంక్షన్ హాల్ లో ప్రధానమంత్రి మన్ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కెళ్ళపల్లి నరేందర్ రావు, ఉప్పల శారద, జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రవి, రుద్ర ప్రదీప్, శ్యామ్ రాథోడ్, జిల్లా సీనియర్ నాయకులు గెంటేల విద్యాసాగర్, పాలేరు అసెంబ్లీ కన్వీనర్ మేక సంతోష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనంత ఉపేందర్ గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోటమర్తి సుదర్శన్, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రవి రాథోడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చావా కిరణ్, ఓబీసీ మోర్ఛ జిల్లా అధ్యక్షుడు వీరుగౌడ్, బీజేపీ జిల్లా కార్యదర్శి నకిరికంటి వీరభద్రం, హటియా నాయక్, జిల్లా సీనియర్ నాయకులు వీరెల్లి లక్ష్మయ్య, బీజేపీ మండల అధ్యక్షులు బట్టు నాగరాజు, బొడ్డుపల్లి ప్రసాద్, మహిళా నాయకురాలు కొలిపాక శ్రీదేవి, బీజేవైఎం మండల అధ్యక్షులు బోడా ప్రకాష్, లక్ష్మారెడ్డి, బీజేపీ రూరల్ మండల ప్రధాన కార్యదర్శి కొమరబత్తిని వెంకన్న, లంకపల్లి సాగర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చీమలదారి విశ్వనాథం, ఓబీసీ మోర్చా నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు, ఎస్సీ మోర్చా నాయకులు ఉపేందర్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed