- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కేంద్ర హోంశాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కేంద్ర సహాయపు నిధులు (ఏసీసీఏ) ద్వారా జిల్లాలో రూ. 106 కోట్లతో 1223 పనులు చేపట్టగా 1208 పనులు పూర్తయ్యాయని, 15 పనులు పురోగతిలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. శుక్రవారం ఏసీసీఏ నిధులు మంజూరు, పనుల పురోగతి, ద్రవ్య వినియమ పత్రాల సమర్పణ తదితర అంశాలపై డిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి ప్రవీణ్ తీవ్రవాద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాగా కలెక్టరేట్ సమావేశపు హాల్ నుంచి ఎస్పీ డాక్టర్ వినీత్ జితో వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పురోగతిలో ఉన్న పనులు రానున్న మార్చి మాసాంతం వరకు పూర్తి చేస్తామని చెప్పారు. 2017-18 సంవత్సరంలో రూ. 5 కోట్లతో 31 పనులు, 2018-19 సంవత్సరంలో రూ. 20 కోట్లతో 290 పనులు, 2019-20 సంవత్సరంలో రూ. 33.33 కోట్లతో 829 పనులు, 2020-21 సంవత్సరంలో రూ.14.25కోట్లతో 39 పనులు, 2021-22 సంవత్సరంలో రూ. 20 కోట్లతో 29 పనులు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏ2 సెక్షన్ పర్యవేక్షకులు అనంత రామక్రిష్ణ, ఎస్బీ సీఐ రాజు, కార్యాలయ సిబ్బంది నళిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.