అగ్ని ప్రమాద సంఘటనపై స్పందించిన మార్కెట్ కమిటీ చైర్​పర్సన్

by Sridhar Babu |
అగ్ని ప్రమాద సంఘటనపై స్పందించిన  మార్కెట్ కమిటీ చైర్​పర్సన్
X

దిశ, ఖమ్మం సిటీ : మార్కెట్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద సంఘటన అత్యంత దురదృష్టకరమని ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్​పర్సన్ దోరెపల్లి శ్వేత తెలిపారు. ఆదివారం తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైస్ చైర్మన్ షేక్ అప్జల్ తో కలిసి ఆమె మాట్లాడారు. ఖమ్మం మార్కెట్లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరగడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలను పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారని, కొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన వివరాలు తెలుస్తాయన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో చిట్టూరు శ్రీనివాస్ అనే వ్యాపారికి సంబంధించిన 1809 పత్తి బస్తాలు కాలి బూడిదయ్యాయని తెలిపారు.

సుమారుగా రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. పంటకు బీమా వర్తించే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడి బాధిత వ్యాపారికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో నిరంతరం మార్కెట్లోనే అగ్నిమాపక వాహనం ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. సమావేశంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ రుద్రాక్ష మల్లేశం, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని కృష్ణారావు ,మెంతుల శ్రీశైలం, ఉపాధ్యక్షుడు సోమ నరసింహారావు ,సహాయ కార్యదర్శి మన్యం కృష్ణ ,కోశాధికారి తల్లాడ రమేష్, ఎగుమతి శాఖ అధ్యక్షుడు నల్లమల ఆనంద్, సంతోష్, దిగుమతి శాఖ కార్యదర్శి ఉప్పల్ రావు, మిర్చి శాఖ కార్యదర్శి ఎడ్లపల్లి సతీష్ ,మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed