అయ్యో బాలుడు.. పాపం ఎవరూ చూడలే, గుంతలోనే ప్రాణాలు పోయాయి

by Dishanational2 |
అయ్యో బాలుడు.. పాపం ఎవరూ చూడలే, గుంతలోనే ప్రాణాలు పోయాయి
X

దిశ ,ఇల్లందు: గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం ఇల్లందు మండలం ముకుందపురం క్యాంప్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోకరి హర్షవర్ధన్(9) ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందాడు. బాలుడు ఆడుకుంటూ చూడకుండా నీటి గుంతలో పడిపోయాడు. ఎవరూ చూడకపోయే సరికి ఉదయం ఏడు గంటల సమయంలో గుంతలో పడి, సుమారు 3 గంటల పాటు అందులోనే ఉండి ప్రాణాలు కోల్పాయాడు. బాలుడు ఇంకా రాలేదని తల్లిదండ్రులు, స్థానికులు కంగారుపడి వెతకగా బాలుడు ఆచూకీ తెలియకపోవడంతో పక్కన ఉన్న ఫెర్టిలైజర్స్ షాపు సీసీ కెమెరాలను పరిశీలించగా బాలుడు గుంతలో పడిన దృశ్యం లభించింది. స్థానికులు తల్లిదండ్రులు ఈ రోజు ఉదయం పది గంటల సమయంలో అక్కడికి చేరుకొని బాలున్ని గుంతలో నుండి తీయగా అప్పటికే మృతి చెందడంతో ముకుందపురం క్యాంప్ గ్రామం‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.


Next Story