సత్తెమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలి

by Shiva |   ( Updated:2023-02-05 11:06:47.0  )
సత్తెమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలి
X

దిశ సత్తుపల్లి: సత్తెమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మండల పరిధిలోని కిష్టారం - చెరుకుపల్లి - జగన్నాథపురం గ్రామాల నడుమ ఉన్న సత్తెమ్మ తల్లి ఆలయ అమ్మవారిని ఆదివారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆయనను ఆలయ పూజారులు పూర్ణకుంభం, మేళ తాళాలతో ఆలయంలోకి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా అలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వికుల నుంచి సరిహద్దు గ్రామాల ప్రజలు సత్తెమ్మ తల్లిని ఇలవేల్పుగా పూజిస్తూ ప్రజలు భక్తి భావాన్ని చాటుతున్నారని ఆయన తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఎమ్మెల్యే వెంకట వీరయ్యను పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణరెడ్డి, ఆలే కమిటీ సభ్యులు, బీఆర్ఎస్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed