పంచాయతీల అభివృద్ధే లక్ష్యం

by Sridhar Babu |
పంచాయతీల అభివృద్ధే లక్ష్యం
X

దిశ, ఇల్లందు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు కేటాయిస్తుందని ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని బాలాజీ నగర్ పంచాయతీలో రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని ఆజాద్ నగర్ నుంచి ఇందిరా నగర్ వరకు రూ.1.20 కోట్లతో బీటీ రోడ్డు వేయనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు సంబంధించిన పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలోని పాలకుల చేతుల్లో నిరాధరణ, నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. కొన్ని నెలలుగా ఇల్లందు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల పరంపర కొనసాగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో మరింత అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని ముందు వరుసలో ఉంచడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముందుగా ఎమ్మెల్యేకు మేళతాళలాలు, పూలు చల్లి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి పులిగళ్ళ మాధవరావు, వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్, డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్ మెట్ల కృష్ణ, సీడీపీఓ లక్ష్మీ ప్రసన్న, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హీరాలాల్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జగన్నాథం, పంచాయతీ సెక్రెటరీ నీలిమ రెడ్డి, మండల కో-ఆప్షన్ ఘాజి, ఉప సర్పంచ్ యాకుభి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శీలం రమేష్, ఖమ్మంపాటి రేణుక,

ఇల్లందు మండల ఇంచార్జ్ యల్లమద్ది రవి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పూనెం కమల, ఆత్మ కమిటీ చైర్మన్ బావు సింగ్, మండల అధికార ప్రతినిధి మూడు హనుమా, వార్డు సభ్యులు శ్యామల, పంచాయతీ కో-ఆప్షన్ నిమ్మల రాములు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కుక్కుమూడి మహేష్, నాయకులు డేరంగుల పోశం,నీలం రాజశేఖర్, వల్లాల నర్సయ్య, పూదురి లక్ష్మీనారాయణ, యాకయ్య, వంశీ, అశోక్, వినోద్, బండ స్వాతి, సరోజ, స్వప్న పాల్గొన్నారు.



Next Story

Most Viewed