- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అందుకే టీఆర్ఎస్ పార్టీలో చేరా : మాజీ మంత్రి తుమ్మల

దిశ వేంసూర్ : వేంసూరు మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కెనాల్ వద్ద మాజీ ముఖ్యమంత్రి శత జయంతి ఉత్సవాలలో భాగంగా జరిగిన బహిరంగ సభలో మాజీ మంత్రి తుమ్మల పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ దేవుడు దయ వలనే ఈ ఈ ప్రాంతం సశ్యశ్యామలం అయింది అన్నారు. తన హయాంలో నిర్మించిన ఎన్టీఆర్ కెనాల్కు రైతులతో కలిసి పుష్పభిషేకం చేశారు. NTR దయవలనే నాగార్జున సాగర్,కృష్ణా జాలాలు తీసుకువచామని అన్నారు. గోదావరి జలాల నీరు ఈ పొలాల్లో కూడా ప్రవహింప చేయాలనేది నా జన్మకోరిక అని ,అది కూడా సీతారామ ప్రాజెక్టు ద్వారా త్వరలో తీసుకువచ్చి మీ కలలు నెరవేరుస్తానని అన్నారు.
రెండు జిల్లాల భవిష్యత్తు కోసం, పచ్చగా పంటలు పండాలనే నేను టీఆర్ఎస్లో చేరానని తెలిపారు. ఖమ్మం జిల్లాలో అత్యంత విలువ గల మండలం ఎదైనా ఉంది అంటే అది వేంసూరు మండలమే అని, సత్తుపల్లికి కూడా ఎంతో ఘనకీర్తి తీసుకువస్తానని, అలాగే గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తి అయితే మీ భూములకు కోట్లు వస్తాయని అన్నారు. అప్పులేకుండా రైతులు సంతోషంగా ఉంటే నా జన్మ సకృతం అవుతుందని. ఎన్టీఆర్ దేవుడు రాజకీయ జన్మ ఇస్తే మీరు నన్ను మీ గుండెల్లో పెట్టుకుని ఆదరించారన్నారు. పాలేరు లో గతంలో లక్ష రూపాయాలకే భూములు అమ్మేవాళ్ళు అని. ఇప్పుడు బంగారం ఇచ్చినా ఒక్క ఎకరం కూడా అమ్మరని.. నా జన్మకి ఇంతకంటే ఏమి కావాలి అన్నారు. నన్ను రాజకీయంగా పెంచిపోషించిన మీకు తోడుగా కడదాక మీతోనే ఉంటానని, ఈ ప్రాంతానికి మీరు అడిగిన అడగకపోయిన ఎవ్వరూ ఎన్ని చేసినా, నా జన్మ మీకే అంకితం అని, రాజకీయలు,కులాలు,మతాల కు అతీతంగా ఆ దేవుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరపడం, నన్ను పిలవటం చాలా సంతోషంగా ఉందన్నారు.