- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ ఎమ్మెల్యే ప్రభుత్వం ఇచ్చిన కళ్ళజోడే వాడుతున్నారట

దిశ, వైరా: వైరా ఎమ్మెల్యే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కంటి వెలుగు వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల ఆధారంగా కంటి వెలుగు శిబిరంలో ఆయనకు ఉచితంగా ఇచ్చిన కళ్ళజోడునే వాడుతున్నారట. వైరాలోని శాంతినగర్లో ఉన్న రైతు వేదికలోఈ నెల 19వ తేదీన ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరంలో ఎమ్మెల్యే రాములు నాయక్ కంటి పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో రాములు నాయక్కు చత్వారము(దగ్గర దృష్టి లోపం)ఉంది. దీంతో ఆయనకు కంటి వెలుగు శిబిరం వైద్యులు ఉచితంగా కళ్ళజోడు అందజేశారు.
ప్రస్తుతం ఎమ్మెల్యే రాములు నాయక్ ఆ కళ్ళజోడునే వాడుతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే విలేకరులకు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కేంద్రంలో కంటి పరీక్షలు చేయించుకుని ఉచితంగా కళ్ళజోళ్ళు పొందాలని కోరారు. ఈ శిబిరంలో కార్పొరేట్ హాస్పటల్కు దీటుగా నాణ్యమైన కళ్ళజోళ్ళు అందిస్తున్నారని చెప్పారు. తాను ప్రైవేట్ హాస్పిటల్ లో తీసుకున్న కళ్ళజోడు కంటే కంటి వెలుగు ఉచిత కళ్ళజోడే నాణ్యత గా ఉందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం నిరుపేదలకు వరం లాంటిదని కీర్తించారు.