ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు స్థలాన్ని సందర్శించిన తానా బృందం

by Disha Web Desk 15 |
ఎన్టీఆర్ విగ్రహ  ఏర్పాటు స్థలాన్ని సందర్శించిన తానా బృందం
X

దిశ, ఖమ్మం : స్థానిక ట్యాంక్ బండ్ చెరువు మధ్యలో నిర్మించ తలపెట్టిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు స్థలంను మంగళవారం సాయంత్రం తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రూ.4 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నెల చివరి వారంలో విగ్రహం ఆవిష్కరణకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం నగరాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభివృద్ధి చేసి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచేలాగా కృషి చేశారన్నారు. తానా అధ్యక్షడు అంజయ్య చౌదరి, కాబోయే అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, మాజీ అధ్యక్షుడు జై తాళ్లూరి, ట్రస్టీ విశ్వనాథ, కమ్మ సంఘం నగర అధ్యక్షుడు వల్లభనేని రామారావు, సెక్రటరీ సరిపుడి సతీష్, బోర్డు మెంబర్ సామినేని రవి, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కొత్తపల్లి నీరజ, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, పైడిపల్లి సత్యనారాయణ, దొడ్డా రవి, చిరుమామిళ్ళ నాగేశ్వరరావు, జశ్వంత్ స్వామి పాల్గొన్నారు.



Next Story

Most Viewed