ఎదులాపురంలో టెన్షన్.. టెన్షన్

by Shiva |
ఎదులాపురంలో టెన్షన్.. టెన్షన్
X

సీపీఐ కార్యకర్త ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టిన సీపీఎం కార్యకర్తలు

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి సీపీఎంకు చెందిన నలుగురు కార్యకర్తలు రెచ్చిపోయారు. సీపీఐ కార్యకర్త ఏపూరి చిన్న గోపి ద్విచక్ర వాహనాన్ని పెట్రోలు పోసి దగ్ధం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చిన్న గోపి ద్విచక్ర వాహనాన్ని ఇంటి ముందు ఉంచాడు. రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో సీపీఎం పార్టీకి చెందిన పొన్నెకంటి వంశీ, పొన్నెకంటి అనీష్, పొన్నెకంటి వంశీ, బచ్చలకూరి వంశీ అకారణంగా గోపీ వాహనాన్ని పెట్రోలు పోసి నిప్పంటించారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు రావడంతో బయటికి వచ్చిన గోపీని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాహనాన్నే కాదు.. తనను, కుటుంబాన్ని కూడా తగలబెడతామని తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు గోపీ తెలిపాడు.

ఘటనా స్థలం పరిశీలన..

ఘటనా స్థలాన్ని ఖమ్మం జిల్లా సీపీఐ సహాయ కార్యదర్శి పోటు ప్రసాద్, శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఘటన జరిగిన విధానాన్ని గోపీని అడిగి తెలుసుకొని, భయపడాల్పిన అవసరం లేదని పార్టీ అండగా ఉంటుందని అతనికి భరోసాని కల్పించారు. ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేసిన దుండగులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీసీఐ కార్యకర్తలు సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర సమితి సభ్యులు సిద్ధినేని కర్ణ కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, జిల్లా కార్యవర్గ సభ్యులు మెడకంటి చిన్న వెంకటరెడ్డి, జిల్లా సమితి సభ్యులు చెరుకుపల్లి భాస్కరరావు, సీపీఐ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, మండల సమితి సభ్యులు వెంపటి వెంకట సురేందర్, రామిరెడ్డి రమేష్, మేళ్లచెరువు వీరబాబు, మేళ్లచెరువు సాయి, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా తిరుమలాయపాలెం, ముదిగొండ ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసు పహారాను ఏర్పాటు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటకృష్ణ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed