దొరల చేతిలో బందీ అయిన తెలంగాణను కాపాడాలి

by Sridhar Babu |
దొరల చేతిలో బందీ అయిన తెలంగాణను కాపాడాలి
X

దిశ, మధిర : దొరల చేతిలో బందీ అయిన తెలంగాణను కాపాడుకుంటామని మధిర శాసనసభ్యులు, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని భట్టి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తూ సంక్షేమ, అభివృద్ధి పథకాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని, ప్రజలు గమనిస్తున్నారని , త్వరలోనే కేసీఆర్ కు బుద్ధి చెప్తారన్నారు. ప్రజల సహకారంతో ప్రజా ప్రభుత్వాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని, అది ఎంతో కాలం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధపు వాగ్దానాలను ప్రజలు నమ్మరని, సామాజిక తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో కోటి ఎకరాలను సాగులోకి తెస్తామని అబద్ధపు ప్రచారం చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలోనే సాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేశామని, వాటిని పునరుద్ధరణ కింద పేర్లు మార్చి కోట్లాది రూపాయలు దండుకున్నారని తెలిపారు.

పీపుల్స్ పాదయాత్ర ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి పనులు చేపిస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో బంగారు తల్లి పేరుతో 18 సంవత్సరాల నిండిన యువతి వివాహ సమయంలో రెండు లక్షల అందించామని, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనలో పేదలకు కేవలం బియ్యం మాత్రమే అందిస్తున్నారని, రైతులకు సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ పరికరాలు ,వడ్డీ లేని రుణాలు అందించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని,కేసీఆర్ కు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. గృహలక్ష్మి పేరుతో ప్రజలకు ఇల్లు ఇవ్వకుండా మభ్యపెడుతుందన్నారు. ఇల్లు లేని ప్రజలు చాలామంది ఉన్నారని, ఇల్లు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు శిథిలావస్థలో ఉన్న పూరి గుడిసెల్లో ఉంచుతారన్నారని, ప్రతి ఒక్కరికి గూడు ఎంత అవసరమో తెలిసిందేనన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అర్హులైన వారికి ఇల్లు కట్టుకునే సదుపాయం కల్పిస్తామన్నారు. అనంతరం మున్సిపాలిటీలోని 11 ,12 డివిజన్ల లో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిర్యాల వెంకటరమణ గుప్తా, కాంగ్రెస్ నాయకులు మళ్ల ప్రదీప్ ఆధ్వర్యంలో 15 కుటుంబాలు శాసనసభ్యులు శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్లో చేరాయి. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో గట్టి గుండె రవి, గట్టి గుండె వెంకటేశ్వరరావు, ఆర్. కృష్ణ, ఆర్. సుధాకర్, ఏసు పోగు విజయ్, ఏసు పోగు బాబు, చెరుకుమల్లి దేవా, జి. ఆనంద్, జి.కౌశిక్, జి.జాన్ ప్రసాద్, జి.జీవన్, దుబాసి బాజీ,

మారాబత్తుల కోటేశ్వరరావు, మేకల శ్రీను, గట్టిగుండే ప్రదీప్ తదితరులున్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు, మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురం శెట్టి కిషోర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు, మున్సిపాలిటీ కౌన్సిలర్ కోన ధని కుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్, కాంగ్రెస్ నాయకులు పారుపల్లి విజయకుమార్, కర్నాటి రామారావు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు చిలువేరు బుచ్చి రామయ్య, గద్దల లాలయ్య, మోదుగు బాబు, గద్దల విజయ్, ఆదిమూలం శ్రీనివాసరావు పాల్గొన్నారు.



Next Story

Most Viewed