- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కేసీఆర్ కలకు ప్రతీక తెలంగాణ : ఎమ్మెల్యే హరిప్రియ
దిశ,ఇల్లందు : కేసీఆర్ కలకు ప్రతీక తెలంగాణ అని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పురప్రముఖులతో కలిసి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన తరువాత తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో ప్రజలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిందని తెలిపారు. కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, ఇల్లందు పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు, ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి, సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్,ఇల్లందు పట్టణ మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మం పాటి రేణుక, ఇల్లందు పట్టణ యూత్ ప్రెసిడెంట్ మెరుగు కార్తీక్ పాల్గొన్నారు.